వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020 -21 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరకు పంటల సేకరణ


గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 24.91% పెరిగిన వరి సేకరణ

55.49 లక్షల మంది రైతులకు ప్రయోజనం: 84928.10 కోట్ల రూపాయల విలువ చేసే వరి సేకరణ

Posted On: 26 DEC 2020 6:10PM by PIB Hyderabad

2020 -21 ఖరీఫ్ పంట మార్కెటింగ్ సీజన్ లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నది. గత సీజన్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకం కింద ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది.

వరిని పండిస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పంట సేకరణ సజావుగా సాఫీగా సాగుతున్నది. ప్రస్తుత ఖరీఫ్ 2020-21 సీజన్ లో 2020 డిసెంబర్ 25వ తేదీవరకు పంజాబ్, హర్యానా , ఉత్తరప్రదేశ్ , తెలంగాణా, తమిళనాడు, ఉత్తరాఖండ్ , చండీఘర్, జమ్మూ కాశ్మీర్,గుజరాత్,ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్ , బీహార్,ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో రైతుల నుంచి 449.83 లక్షల మిలియన్ టన్నులకు పైగా వరిని సేకరించడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రైతుల నుంచి 360.09 లక్షల మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంతవరకు వరి సేకరణ 24.91% పెరిగింది. సేకరించిన మొత్తం 449.83 లక్షల మిలియన్ టన్నుల వరిలో 45.07%శాతం అంటే 202.77లక్షల మిలియన్ టన్నులను ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే సేకరించడం జరిగింది. ఇంతవరకు 84928.10 కోట్ల రూపాయల విలువ చేసే వరిని 55.49 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి సేకరించడం జరిగింది.  

ఇంతే కాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ కాలం 2020లో రైతుల నుంచి 51.66 లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను ధర మద్దతు పధకం (పిఎస్ఎస్ ) కింద కొనుగోలు చేయడానికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణా, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితోపాటు 1.23లక్షల మిలియన్ టన్నుల ఎండు కొబ్బరిని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి.

ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర మద్దతు పధకం కింద పప్పు ధాన్యాలు,నూనె గింజలు, కొబ్బరిని సేకరించడానికి అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020-21 ఖరీఫ్ పంట కాలంలో నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్న రైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడెల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

2020 డిసెంబర్ 25వ తేదీ వరకు ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా తమిళనాడు,మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ మరియు హర్యానా రాష్ట్రాలలో 1214.09 కోట్ల రూపాయల విలువ చేసే 226758.57 మిలియన్ టన్నుల సెనగలు, వేరుశెనగ, సోయాబీన్ మరియు మినుములను సేకరించింది. దీనివల్ల 123292 మంది రైతులు లబ్ది పొందారు.

ఇదేవిధంగా కర్నాటక మరియు తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మిలియన్ టన్నుల ఎండుకొబ్బరిని డిసెంబర్ 25వ తేదీ నాటికి సేకరించడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి 293.34 మిలియన్ టన్నుల కొబ్బరిని సేకరించారు. కొబ్బరి, మినుములు ఎక్కువగా సాగవుతున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల సేకరణ పంజాబ్, హర్యానా,రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక,మరియు గుజరాత్ రాష్ట్రాలలో చురుగ్గా సాగుతున్నది. డిసెంబర్ 25వ తేదీనాటికి కనీస మద్దతు ధర పథకం కింద 19697.98 కోట్ల రూపాయల విలువచేసే 6730298 బేళ్ల పత్తిని 1310539 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.

******



(Release ID: 1683920) Visitor Counter : 152