వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 లో ఎంఎస్పి కార్యకలాపాలు

Posted On: 07 DEC 2020 5:50PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21లో, ప్రభుత్వం ప్రస్తుతమున్న ఎంఎస్పి పథకాల ప్రకారం రైతుల నుండి ఖరీఫ్ 2020-21 పంటలను కొనుగోలు చేస్తోంది. 

పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ & కశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు బీహార్ రాష్ట్రాల నుండి ధాన్యం సేకరణ సజావుగా సాగుతోంది. 06.12.2020 వరకు 344.86 ఎల్‌ఎమ్‌టిలు కొనుగోలు చేయడం ద్వారా గత సంవత్సరం కొనుగోలు 282.66 ఎల్‌ఎమ్‌టితో పోలిస్తే 22% పెరిగింది. మొత్తం 344.86 ఎల్‌ఎమ్‌టి కొనుగోలులో, పంజాబ్ ఒక్కటే 30.11.2020 కి సేకరణ కాలం పూర్తయ్యే వరకు 202.77 ఎల్‌ఎమ్‌టిని అందించింది, ఇది మొత్తం సేకరణలో 58.79%.  

 

సుమారు 35.03 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి ఎంఎస్పి విలువ పరంగా చుస్తే రూ.65111.34 కోట్లు లబ్ధి పొందారు.

 

ఇంకా, రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020లో  45.24 ఎల్ఎంటి పప్పుధాన్యాలు, నూనె గింజలు కొనుగోలుకు అనుమతి లభించింది. ధర మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టి కొబ్బరికురిడి (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే ఇతర రాష్ట్రాలు / యుటిల కోసం, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి కురిడీలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించడానికి కూడా ఆమోదం లభిస్తుంది, తద్వారా ఈ పంటల ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగా పొందవచ్చు.

06.12.2020 వరకు, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 133550.58 మెట్రిక్ టన్నుల రూ. 718.51 కోట్లు ఎంఎస్పి విలువ గల పెసర, మినప, వేరుశనగ గుళ్ళు,  సోయాబీన్లను సేకరించడం ద్వారా తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో 76002 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

అదేవిధంగా, రూ .52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడి (శాశ్వత పంట) కర్ణాటక, తమిళనాడులలోని 3961 మంది రైతులకు 06.12.2020 వరకు లబ్ధి చేకూరింది. కొబ్బరి కురిడీ, మినప సంబంధించి, ప్రధాన ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రేట్లు ఎంఎస్పి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి వచ్చిన రాష్ట్రాల ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

 

పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్పి ఆధ్వర్యంలో సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 06.12.2020 వరకు రూ .11084.78 కోట్ల విలువైన 3832259 కాటన్ బేళ్ల 750779 మంది రైతులకు లబ్ధి చేకూర్చాయి.

 

****



(Release ID: 1678969) Visitor Counter : 186