PIB Headquarters
డిసెంబర్8వ తేదీ న హైదరాబాద్ లోని ఐకియా లో ఇండియన్నేవి బ్యాండ్ కాన్సర్ట్
Posted On:
03 DEC 2019 6:36PM by PIB Hyderabad
నౌకా దళ దినోత్సవాల లో భాగం గా.. దేశం లోని అన్ని నౌకాదళ స్థావరాల లో వివిధ కార్యక్రమాల ను నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు హైదరాబాద్, సికిందరాబాద్ లలో కూడా కొన్ని కార్యక్రమాల ను ఏర్పాటు చేసినట్లు భారతీయ నౌకాదళం ఒక ప్రకటన లో తెలిపింది.
భారతదేశం ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీ నాడు నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. 1971 లో జరిగిన భారత్-పాక్ యుద్ధం కాలం లోచేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్ లో భాగం గా కరాచీ నౌకాశ్రయం పై విద్యుత్ శ్రేణి కి చెందిన క్షిపణి సహిత పడవల తో జరిపిన దాడి విజయవంతం కావడాన్ని స్మరించుకొంటూ, ఈ నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది.
సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 4వతేదీ నాడు పూల దండ సమర్పణ కార్యక్రమం, అదే రోజు న బొలారం లోని నేవి హౌస్ లో పూర్వ ఉద్యోగుల తో సంభాషణ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 8వ తేదీ, ఆదివారం నాడు హైటెక్ సిటి లోని ఐకియా లో సాయంత్రం పూట 6-7 గంట ల మధ్య ఇండియన్ నేవి బ్యాండ్ కాన్సర్ట్ ఉంటుంది. ఈ కార్యక్రమాని కి ప్రజల కు ప్రవేశం ఉచితం అని భారతీయ నౌకాదళం తెలిపింది.
**
(Release ID: 1594766)