మంత్రిమండలి
సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇండియా, ఫిన్లాండ్ దేశాల మధ్యన కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి కేబినెట్ ఆమోదం.
Posted On:
12 JUN 2019 8:13PM by PIB Hyderabad
ఇండియా, ఫిన్లాండ్ దేశాల మధ్యన సైబర్ సెక్యూరిటీ రంగంలో కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఈ ఆమోదం తెలిపింది.
ఇండియా, ఫిన్లాండ్ దేశాల మధ్యన ఈ రంగంలో బలమైన సహకారానికి ఈ ఎంఓయు ద్వారా సాధ్యమవుతుంది. భద్రతాపరమైన సమస్యలను గుర్తించడానికి, వాటిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి, వాటిని నియంత్రించడానికి ఇరుదేశాలు సాధించిన అనుభవాలను, విజ్ఞానాన్నిఇరుదేశాలు పంచుకోవడం జరుగుతుంది.
ఈ ఎంఒయు పై 2019 జనవరిలో ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
***
(Release ID: 1574510)
Visitor Counter : 75