PIB Headquarters
అంతర్జాతీయ బీమా సమావేశం
Posted On:
09 FEB 2018 6:42PM by PIB Hyderabad
బీమా నియంత్రణ అభివృద్ధి సాధికార సంస్థ (ఐఆర్డిఎఐ) హైదరాబాద్ లో అంతర్జాతీయ బీమా సమావేశాన్ని నిర్వహించనుంది. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన 400 నుండి 500 మంది బీమా సూపర్వైజర్లు, బ్రోకర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. బీమా పరిశ్రమకు చెందిన పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఈ సమావేశంలో ఫిబ్రవరి 11, 2018న ముగింపు ఉపన్యాసం చేస్తారు. గచ్చిబౌలి లో ఐఆర్డిఎఐ నిర్మించిన నూతన భవనాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు.
****
(Release ID: 1520161)