ఆర్థిక మంత్రిత్వ శాఖ
గ్రామీణాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో గోబర్-ధన్ పథక౦
Posted On:
01 FEB 2018 1:40PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు, గ్రామీణ ప్రాంత ల్లో నివసించే వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచటానికి గోబర్-ధన్(గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్స్ ధన్) అనేనూతన పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా బయోగ్యాస్, నేచరల్ గ్యాస్ తయారీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.గ్రామీణులు తమ ఇళ్లలో ఉన్న పశువుల పేడను,పంటపొలాల్లో వృథాగా ఉన్న ఘనవ్యర్థాలను కంపోస్ట్ చేసుకుంటారు. దీని ద్వారా బయోగ్యాస్, నేచరల్ గ్యాస్ తయారై గ్రామీణులు వంట అవసరాలకు దోహదపడతాయని మ౦త్రి అన్నారు. గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిననమామిగంగ కార్యక్రమం కోసం 187 ప్రాజెక్టులను మ౦జూరు చేసినట్లు ఆర్థిక మ౦త్రి తెలిపారు..
గ్రామీణ పారిశుద్ధ్యానికి బడ్జెట్లో మ౦త్రి ప్రాధాన్యత కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపరితల పరిశుభ్రత కోసం రూ.16,713కోట్లను కేటాయించడ౦ జరిగి౦దని, ఇందులో ఇప్పటికే 47 ప్రాజెక్టులు పూర్తికాగా, మిగతావి చివరి దశకు వచ్చాయని మ౦త్రి తెలిపారు. గంగా నది పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం సాధించడానికి ఈ ప్రాజెక్టులను ప్రత్యేకంగా చేపట్టారు. గంగా నది పరివాహాక ప్రాంతంలో ఉన్న 4465 గంగా గ్రామలను బహిరంగమల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించారు.
ప్రజల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించడానికై బడ్జెట్లో ఫైలట్ ప్రాజెక్ట్ కింద 115 జిల్లాలను ఎంపిక చేయడ౦ జరిగి౦దని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు సామాజిక సేవలకు సంబంధించిన అంశాలైన ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం,నైపుణ్యాల పెంపుపై దృష్టిసారి౦చడ౦ జరుగుతు౦దని, ఆర్థికంగా సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మ౦త్రి తెలిపారు.కనీస అవసరాలైన నీటిపారుదల సౌకర్యాలు, గ్రామాల్లోనిరంతర విద్యుత్ కల్పన, తాగునీరు అందించడం, త్వరితగతిన పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడ౦ జరుగుతు౦ది.ఈ 115 జిల్లాలు అభివృద్ధి నమూనాలుగా మార్పు చె౦దుతాయని ఆశిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 1518832)
Visitor Counter : 89