ప్రధాన మంత్రి కార్యాలయం

సావిత్రీబాయి ఫులే జ‌యంతి నాడు ఆమెకు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 JAN 2018 11:57AM by PIB Hyderabad

సావిత్రీబాయి ఫులే జ‌యంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు నివాళులు  అర్పించారు.

“మ‌హ‌నీయురాలు అయిన‌టువంటి సావిత్రీబాయి ఫులే కు నేను న‌మ‌స్క‌రిస్తున్నాను.  పేద‌లు మ‌రియు అణ‌గారిన వ‌ర్గాల వారికి సాధికారిత‌ను సంపాయించి పెట్టడం కోసం ఆమె త‌న జీవితాన్ని అంకితం చేశారు.  విద్య‌కు మ‌రియు సామాజిక సంస్క‌ర‌ణ‌కు ఆమె అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు.  ఆమె ఆద‌ర్శాలకు పెద్ద పీట వేస్తూ, ఆమె యొక్క క‌ల‌ను పండించే దిశ‌గా మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 
 

***


(Release ID: 1515172)
Read this release in: English , Kannada