సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిషన్ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
20 DEC 2017 8:04PM by PIB Hyderabad
ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిషన్ పదవీకాలాన్ని పన్నెండు వారాల పాటు అంటే, 2018 ఏప్రిల్ 2వ తేదీ వరకు, పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంబంధిత వర్గాలతో కమిషన్ సంప్రదింపులను జరిపిన అనంతరం ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశంపై ఒక సమగ్రమైన నివేదికను సమర్పించేందుకు ఈ పొడిగింపు వీలు కల్పిస్తుంది.
రాష్ట్రపతి ఆమోదం తీసుకొని 2017 అక్టోబర్ 2వ తేదీ న రాజ్యాంగ 340 అధికరణంలో భాగంగా ఈ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. చైర్ పర్సన్ పదవీబాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పన్నెండు వారాల లోపల కమిషన్ తన నివేదికను సమర్పించాలని స్పష్టంగా నిర్ణయించడమైంది.
ఒక విస్తృతమైనటువంటి నివేదికను సిద్ధం చేయడం కోసం విశాలమైన సమాచార రాశిని పరిశీలించవలసివున్న కారణంగాను, అందుకు సమయం పడుతుందన్న కారణంగాను కమిషన్ తన పదవీకాలాన్ని పన్నెండు వారాల పాటు పొడిగించవలసిందని అభ్యర్థించింది.
పూర్వరంగం:
జస్టిస్ (రిటైర్డ్) శ్రీమతి రోహిణి నాయకత్వం వహిస్తున్న కమిషన్ 2017 అక్టోబర్ 11 వ తేదీ నాడు పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ఇతర వెనుకబడిన తరగతుల వారికి (ఒబిసి లకు) రిజర్వేషన్ ను కలిగివున్న అన్ని రాష్ట్రాలు/యుటి ల తోను, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ల తోను ఈ కమిషన్ సమావేశమైంది. ఇతర వెనుకబడిన తరగతుల వారికి చెందిన కేంద్ర జాబితాలో చేర్చిన కులాలు సముదాయాల లో రిజర్వేషన్ తాలూకు ప్రయోజనాల పంపకంలో అసమానత ఏమైనా జరిగిందేమో నిర్ధరించే దృష్టితో గత మూడు సంవత్సరాల కాలంలో ఉన్నత విద్య కోర్సుల లోకి ఒబిసి ల ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా 197 ఉన్నత విద్య సంస్థలను కమిషన్ కోరింది; అలాగే, గడచిన మూడేళ్ల లో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలతో పాటు సిపిఎస్ ఇ లలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఒబిసి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ కోరింది.
***
(Release ID: 1513516)