ప్రధాన మంత్రి కార్యాలయం

ఎస్ యు- 30ఎమ్ కెఐ నుండి ప్రప్రథమంగా బ్రహ్మోస్ ఎఎల్ సిఎమ్ ను విజయవంతంగా పరీక్షించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 NOV 2017 2:48PM by PIB Hyderabad

ఎస్ యు- 30ఎమ్ కెఐ యుద్ధ విమానం నుండి తొలి సారి బ్రహ్మోస్ ఏర్ లాంచ్ డ్ క్రూజ్ మిసైల్ (ఎఎల్ సిఎమ్) ను విజయవంతంగా పరీక్షించడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసాయోగ్య సాహసకృత్యంలో పాలు పంచుకొన్న వారందరినీ ప్రధాన మంత్రి అభినందించారు.

‘‘ఎస్ యు- 30ఎమ్ కెఐ యుద్ధ విమానం నుండి తొలి సారి బ్రహ్మోస్ ఏర్ లాంచ్ డ్ క్రూజ్ మిసైల్ (ఎఎల్ సిఎమ్) ను విజయవంతంగా పరీక్షించడం సంతోషదాయకం. ఈ ప్రశంసాయోగ్య సాహసకృత్యంలో పాలు పంచుకొన్న వారందరికీ అభినందనలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1510603) Visitor Counter : 61


Read this release in: English