ప్రధాన మంత్రి కార్యాలయం

యునెస్కో సృజ‌నాత్మ‌క న‌గ‌రాల నెట్ వ‌ర్క్ లో చెన్నై చేరినందుకు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 NOV 2017 5:52PM by PIB Hyderabad

యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వ‌ర్క్ లో చెన్నై చేరిన సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చెన్నై వాసుల‌ను అభినందించారు. 

‘‘చెన్నై న‌గ‌రం త‌న సుసంప‌న్న‌మైనటు వంటి సంగీత సంప్ర‌దాయానికి గాను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వ‌ర్క్ లో చేరిన సంద‌ర్భంగా చెన్నై వాసుల‌కు అభినంద‌న‌లు. ఇది భార‌త‌దేశం గ‌ర్వించే క్ష‌ణం’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు. 



(Release ID: 1508662) Visitor Counter : 50


Read this release in: English